కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే మళ్లీ బాధ్యతలు స్వీకరించాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభిప్రాయపడ్డారు. పార్టీలోని ప్రతి కార్యకర్త రాహుల్ గాంధీకి అండగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎందుకంటే దేశంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆయన భాద్యతాయుతంగా మాట్లాడుతారనీ, సమస్య పట్ల ప్రభుత్వాలనీ, అధికారులను రాహుల్ గాంధీ మాత్రమే నిలదీయగలరని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఛత్తీస్గడ్ సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి బాధ్యతగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.