(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : 2013 నాటి చట్ట ప్రకారం భూసేకరణకే రూ.33,000 కోట్ల వ్యయం అవుతుందని పీపీఏ భావిస్తోంది. సబ్ కార్యదర్శి ఆర్.కె. గుప్తా నేతృత్వంలో అంచనాలను రూపొందించడంలో నిమ గ్నమైంది. ఇతర రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారుల తోనూ సమీక్షించాక తుది అంకెను ఖరారు చేయాలని పీపీఏ ఆలోచిస్తోంది. జాతీయ హోదాను ప్రకటించిన ఈ ప్రాజె క్ట్టుకు 2014 నాటి అంచనాల మేరకు 100% నిదులను కేంద్రమే భరిస్తుందని రాష్ర్ట విభజన చట్టం స్పష్టంగా పేర్కొం ది. పోలవరం ప్రాజెక్టు అంచనా 2005-06 నాటికి రూ. 10,151.04 కోట్ల నుంచి 2010-11 నాటికి రూ. 16.010.45 కోట్లకు చేరుకుంది. 2010-11 తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులపై రాష్ర్ట ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపలేదు. అందువల్ల ఈ ప్రాజెక్టు అంచనాలను సవరిం చడంపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ర్ట విభజన తర్వాత ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిధులను కేంద్రం విడుదల చేసేలా ఒత్తిడి పెంచారు. ఫలితంగా కేంద్రం నాబార్డు నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. అయితే ఇప్పటి దాకా 2010-11 అంచనా మాత్రమే అధికారికంగా ఉంది. రాష్ర్ట విభజన తర్వాత రాష్ర్ట జలవనరుల శాఖ రూపొందించిన అంచనా రూ. 30,450 కోట్లుగా ఉంది. దీనిని పీపీఏ పరిశీలిస్తోంది. మరోవైపు, ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ 2014-15 నాటి అంచనా వ్యయాన్ని కేంద్రం పూర్తిగా భరిస్తుందంటూ లిఖిత పూర్వకంగా స్పష్టం చేస్తూ వచ్చింది. అయితే, ఈ ప్రకటనపై రాజకీయపక్షాలు పలు సందేహాలు లేవనెత్తాయి. కేంద్రం కేవలం రూ.16,010.45 కోట్లను మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైందంటూ ఆరోపణలు గుప్పించాయి. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వాలని, 2019 నాటికి ప్రాజెక్ట్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ర్ట ప్రభుత్వం ఆలోగా ప్రాజెక్టు అంచనాలపై స్పష్టత రాకుంటే నిర్మాణ వ్యయభారం మోయడం కష్టమవుతుందని కేంద్రానికి స్పష్టం చేసింది. కాగా, పోలవరం సూపరింటెండింగ్ ఇంజినీరు(ఎస్ఈ) రమేశ్ ఉద్యోగ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 30తో ముగిసింది. ప్రస్తుతం క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందువల్ల, ఆయనను ఎస్ఈ హోదాలో మరో రెండేళ్లు పనిచేసేలా జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మెమో జారీ చేశారు.