ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గ గుడికి చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 01:17 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రధాన ఆలయాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఆలయాల్లో ఆర్ధికపరమైన చిక్కులను అధిగమించేందుకు, ఆలయాల ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానా నికి చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ను నియమించనున్నారు. ఇదే సమయంలో దేవస్థానం లో ఎండోమెంట్‌ కమిటీని కూడా నియమిస్తారు. గత పది సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక అంశాలలో ఏమి అమలు చేసిందో, అదే తీరులో దుర్గగుడి, మిగతా ప్రధాన ఆలయాల్లో కూడా అమలు చేయనున్నారు. దేవాదాయశాఖ సలహాదారు నరసింహమూర్తి, మల్టీ జోన్‌ -1 రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌లు ఈనెల 2న ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదికను అనుసరించి తాజా నిర్ణయం తీసుకున్నారు. చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ (సీఎప్‌ఓ) దేవస్థానంలో పనిచేస్తారు. ఆయనకు సహాయకులుగా అసిస్టెంట్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ను నియమిస్తారు. అయితే వీరికి ట్యాలీ ప్యాకేజిలో నైపుణ్యం ఉండాలి, సంబంధిత మిగతా సాప్ట్‌వేర్‌లో కూడా అనుభ వం ఉండాలి. ఇంటర్నల్‌ ఆడిట్‌ కమిటీని కూడా నియమిస్తారు. ఎండోమెంట్‌ ఫైనాన్స్‌ కమిటీ మరొకటి ఉంటుంది.ఈ కమిటీలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సలహా దారు నరసింహమూర్తి, ఎండోమెంట్‌ కమిషనర్‌, అదనపు ఆర్దిక సలహాదారు బాలాజీలు ఉంటారు. వీరు కనీసం 15 రోజుల కొకసారి సమావేశమై ఆర్థిక విషయాలను సమీక్షిస్తారు. రాజధానిలో గాని, లేదా ప్రధాన ఆలయాల్లో ఏదో ఒకచోట కమిటీ సమావేశం కావాల్సి ఉంటుంది. ఆలయాల్లో ఆర్థిక వ్యవహా రాలు చూసేందుకు ఇప్పటివరకు పటిష్ట వ్యవస్థ లేదు. ఆలయాల అకౌంటింగ్‌ విభాగాలలో పనిచేసే వారు కూడా ఈవోలు లేదా ఆలయాలకు నియామకమైన బోర్డులు చెప్పినట్లు నడచుకుంటుంటారు. దీంతో వ్యయాలకు చెక్‌ ఉండదు. ఇష్టానుసారం వ్యయం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఆదాయాలను పెంపొందించేందుకు ఒక క్రమ విధానం లేదు, ఇప్పుడు తాజా ప్రభుత్వ నిర్ణ యం మేరకు ఆలయాల ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతుందని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత పది సంవత్సరాల నుంచి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తున్నందున దానిని మార్గదర్శకంగా తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com