విజయవాడ, సూర్య బ్యూరో : ఏపీ ఎంసెట్ ర్యాంకు కార్డులను శుక్రవారం నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూకే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఏపీ ఎంసెట్ ఫలితాలను ఈనెల 5న విడుదల చేశామని, ఇప్పటి వరకు ఎంసెట్లో అర్హత సాధించి ర్యాంకులు పొందని అభ్యర్థులు ఆందోళన చెందవద్దని తెలిపారు. అభ్యర్థులు కొందరు దరఖాస్తు చేసే సమయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర హాల్టిక్కెట్ నంబరు బదులు ఇంటర్ ప్రథమ సంవత్సర హాల్టిక్కెట్ నంబర్తో దరఖాస్తు చేసుకోవడం వల్ల వారికి సంబంధించిన మార్కులు ఓపెన్ కావడం లేదని తెలి పారు. ఎంసెట్కు సంబంధించిన సందేహాల నివ త్తికి విద్యార్థులు, తల్లిదండ్రు లు 0884 2340535, 2356255 ఫోన్ నెంబర్ల ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చని కన్వీనర్ తెలిపారు.