విజయవాడ, సూర్య బ్యూరో : దేశంలో ప్రజలపై అర్ధిక భారాలు పెరిగాయని, పెద్ద నోట్ల రద్దు తర్వాత నిరుద్యోగం పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. నగరంలో బుధవారం ఆయన మీడ యాతో మాట్లాడుతూ దక్షిణ భారతంలో కరువు పెరిగిపో యిందని, ఏపీలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులను ఆదుకోవడలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ప్రతి ఏటా 12 వేల మందికి పైగా రైతులు అత్మహత్యలకు పాల్పడుతు న్నారన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపో యిందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈవీఎంలపై 12న ఎన్నికల సంఘం అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి మిషన్తో పేపర్ ట్రైల్ ఉండాలన్నారు. పేపర్ ట్రైల్ అధారంగానే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. పార్టీలకు బాండ్ల పేరుతో చందాలు ఇస్తున్నారని, ఇది పొలిటికల్ పార్టీ కరప్షన్గా మారె అవకాశం ఉందన్నారు. కార్పొరెట్ ఫండ్గ పొలిటికల్ పార్డీలకు ఇవ్వకుండా ఆపాల్సిన అవసరం ఉందని స్టేట్ ఫండింగ్ తీసుకురావాలని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరతామన్నారు. కాశ్మీర్లో పరిస్ధితులు సాధారణస్థితికి మారడానికి ప్రభుత్వానికి సలహాలు ఇస్తామన్నారు. దేశంలో దళితులపై దాడులు పెరిగాయని, ఆందోళన చేస్తున్న సమయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి సమ స్యలను పరిష్కరించాలని కోరారు. దేశంలో విదేశీ పెట్టు బడులు రాలెదని, ఏపీలో రాజధానికి ప్రచార ఆర్బా టమే తప్ప ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. టిడిపి, బిజెపిని వీడె పరిస్ధితి లేదన్నారు. ప్రత్యేక హోదాపై పార్ల మెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడు మాట తప్పితే పార్లమెంట్కు ఏం విలువ ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో నార్త్, సౌత్ భావాలు ఉండకూడదన్నారు. నార్త్ వల్ల సౌత్కి, సౌత్ వల్ల నార్త్కి ఇబ్బందులుంటే మాట్లాడుకోవాలే తప్ప విభజించి చూడకూడదని తెలిపారు. ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు చర్చిస్తున్నాయని, భవిష్యత్తులో ఎలా ఉంటుదో చూద్దాం అంటూ సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.