రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా మార్చాలనే మోదీ ప్రభుత్వపు నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె బాట పడుతున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. ఈ సమ్మెలో ఏకంగా 2 లక్షలకు పైగా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆగస్ట్ నెలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగిరానుంది. అయితే విలీన ప్రక్రియ ప్రైవేటీకరణకు దారితీస్తుందని బ్యాంకులు ఆందోళకు దిగుతున్నాయి.