కలాం జీవితం యువతకు ఆదర్శమని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. తొలుత కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ పోఖ్రాన్వంటి ఎన్నో విజయవంతమైన ప్రయోగాలలో కీలక పాత్ర వహించిన మహనీయుడు కలాం అన్నారు. కలాం కోరిమేరకు యువత కలలు కనాలని, లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ కలాం శాస్త్ర పరిజ్ఞానంతో వైద్యరంగానికి అనేక సేవలు చేశారన్నారు. తక్కువ ఖర్చుతో మందుల తయారీకి ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నేతల నసీర్ అహ్మద్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.