ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెయిలీ లిపీలో లేఖలు రాశారు. గుంటూరు నగరం బ్రాడీపేట లోని షిరిడిసాయి అంధుల పాఠశాలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ రాష్ట్రంపై మోదీ వివక్ష చూపడం బాధకరం అన్నారు. ఆంధ్రులు పోరాడి ప్రత్యేక హోదా సాధించుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం నాయకుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర మేధావుల పోరం నాయకుడు పీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.