భదోహి : ఉత్తర్ ప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా కాన్వాయ్లోని ఒక కారు మూడు అడుగుల లోతున్న గోతిలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆరై పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి గుప్తా గాయపడిన పోలీసులను తన కారులో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రయాగ్ రాజ్నుంచి మంత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.