విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. యాగశాలలో వేదమంత్రోచరణల మధ్య పూర్ణాహుతితో ఉత్సవాలు నిర్వహించారు. పూర్ణాహుతిలో ఈవో సురేష్ బాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.మంగళవారం సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవంతో ఉత్సవాలు పూర్తైయ్యాయి.హంస వాహనంపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు కృష్ణానదిలో జలవిహరం చేశారు. బుధవారం భవానీ భక్తుల దీక్ష విరమణ చేయనున్నారు. దీక్ష విరమణ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.