శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాహనసేవల్లో కళాప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
జానపద శైలిలో సాగిన మధ్యప్రదేశ్ నోర్దా నృత్యం
మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీ అమన్ చౌసియా ఆధ్వర్యంలోని 15 మంది బృందం నోర్దా నృత్యాన్ని ప్రదర్శించింది. స్థానిక సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ జానపద శైలిలో నృత్యాన్ని ప్రదర్శించారు.
పశ్చిమబెంగాల్ చోడెన్స్ నృత్యం
పశ్చిమబెంగాల్ కు చెందిన శ్రీ నాగేంధ్రనాథ్ సింగ్ నేతృత్వంలో 14 మంది కళాకారులు చేసిన చోడెన్స్ నృత్యం ఆకట్టుకుంది.
రాజస్థాన్ గేర్ నృత్యం
రాజస్థాన్ కు చెందిన శ్రీ ఉక్కురామ్ పరివార్ ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు ప్రదర్శించిన గేర్ డ్యాన్స్ ఆకట్టుకుంది.
పుదుచ్చేరి కాలియాట్టమ్
పుదుచ్చేరికి చెందిన ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖ ఆధ్వర్యంలోని 15 మంది కళాకారులు కాలియాట్టమ్ ప్రదర్శన ఇచ్చారు.
ఛత్తీస్ ఘడ్ సంప్రదాయ నృత్యం
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి శ్రీ కేశోరామ్ యాదవ్ నేతృత్వంలో 15 మంది కళాకారులు వారి సాంప్రదాయ నృత్యాన్ని లయబద్ధంగా ప్రదర్శించారు.
మహరాష్ట్ర డ్రమ్స్ వాద్యం
మహరాష్ట్రకు చెందిన శ్రీ ఎం.జీ.కటేకర్ నేతృత్వంలో 30 మంది కళాకారులు వారి సాంప్రదాయ వేషాధారణలో డ్రమ్స్ వాయించారు.
కర్ణాటక సంకీర్తన నృత్యం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీఎన్. రాజు నేతృత్వంలో 15 మంది కళాకారులు సంకీర్తన నృత్యం ప్రదర్శించారు.