షాజహాన్పూర్లో అత్యాచారానికి గురైన న్యాయ శాస్త్ర విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు న్యాయ్ యాత్ర చేపట్టారు. అయితే పోలీసులు వారిని నిలువరించి, అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు జితిన్ ప్రసాద, కౌశల్ మిశ్రా తదితరులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. న్యాయ శాస్త్ర విద్యార్థినిపై బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఈ కేసులో చిన్మయానంద జైలులో ఉన్నాడు. కాగా, చిన్మయానందను డబ్బు కోసం న్యాయశాస్త్ర విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేస్తోందనే ఆరోపిస్తూ పోలీసులు అమెను అరెస్టు చేశారు.