న్యూఢిల్లి : మూకుమ్మడి అత్యాచారానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానోకు రెండు వారాల్లో 50 లక్షల రూపాయిల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఐదు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసినప్పటికీ బానోకు పరిహారం ఇవ్వలేదని, ఉద్యోగం కల్పించలేదని ఆమె తరఫు న్యాయవాది శోభా గుప్తా సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీనితో సుప్రీంకోర్టు ధర్మాసనం పై ఆదేశాలు జారీ చేసింది.