పాత గొడవల నేపథ్యంలో జరిగిన దాడిలో ఇరువురు వ్యక్తులు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా, తెనాలి పట్టణ శివారు కరెవరం రోడ్డులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామీణ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కరెవరం గ్రామానికి చెందిన షేక్ అబుల్ బారి, ఆరిఫ్, కోటి అనే ముగ్గురు స్నేహితులు తమ గ్రామం నుంచి తెనాలి వస్తున్నారు. వారు తెనాలి శివార్లకు చేరుకోగానే వారిపై శ్రీను, వెంకటేష్ మరో వ్యక్తి కలసి కత్తులతో దాడిచేశారు. ఈ ఘట నలో ఆరిఫ్ కాలికి, అబ్దుల్ బారి చెవి వద్ద గాయాలయ్యాయి. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.