తిరుమల మొదటిఘాట్ చివరి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో వెళుతున్న పోలీసుల వాహనం బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు పోలీ సులకు స్వల్పగాయాలయ్యాయి. బ్రహ్మోత్సవాల బందోబస్తుకు అనంతపురం నుంచి వచ్చిన ఏపీఎస్పీ 14వ బెటాలియన్కు చెందిన సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. స్వల్ప గాయాలతో పోలీసు సిబ్బంది బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 22 మంది సిబ్బంది ఉన్నారు. గాయపడ్డ పోలీసు సిబ్బంది రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.