ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి దేవస్థానం సహా ఇతరత్రా అన్ని హిందూ దేవాలయాల్లో పనిచేసేందుకు హిందువులకు మాత్రమే అవకాశముంటుంది. ‘దేవాలయాల్లోని ఉద్యోగులుగా హిందువులు మాత్రమే ఉండాలి. వేరే మతాలను అనుసరించే వారు వేరే శాఖల్లోకి వెళ్లాలి’ అని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా క్రైస్తవులు లేదా ముస్లిం ఉద్యోగుల ఇళ్ళల్లో జరిగిన పండుగలు, పెళ్ళిళ్ళు ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు అందిస్తే... వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి. ఆయా సమాచారం నిజమేనని రుజువైనపక్షంలో... సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారు.