ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2019, 01:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది. ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 విడుదల చేసింది. గత ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా జీవో 99ని విడుదల చేసింది. వైయస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com