తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, శ్రీరంగనాథ రాజులు స్వామి వారిని దర్శంచుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులను అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు తీర్థప్రసాదాలు ఇచ్చి శేషవస్త్రంతో సత్కరించారు.