బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముంబై పర్యటన రద్దయింది. ఈ నెల 26వ తేదీన ముంబై పర్యటన సందర్భంగా అమిత్షా బిజెపి - శివసేన పొత్తు గురించి ప్రకటించాల్సి ఉంది. అయితే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఇంకా ఒక అవగాహన కుదరకపోవడంతో అమిత్షా పర్యటన రద్దయిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.