ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పాతజమానా వస్తేనే బాగుండు: సుప్రీం సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 07:27 PM

సోషల్‌ మీడియాను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అన్ని హంగులతో వస్తున్న స్మార్ట్ ఫోన్ లతో అంతే స్మార్ట్ కష్టాలు వస్తున్నాయి అని పేర్కొంది. మంచి కంటే చెడునే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. మళ్లీ బేసిక్‌ మోడల్‌ మొబైల్‌ ఫోన్ల జమానా వస్తే బాగుండు అని ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది అత్యున్నత దర్మాసనం. టెక్నాలజీ వల్ల సౌకర్యం కంటే ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయా అన్న అనుమానం వస్తోంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్లో అన్ని ఫీచర్లు ఉన్నాక పెడ ధోరణులు పట్టకుండా కట్టడి చేయడం కష్టతరం అవుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా కట్టడికి నిబంధనలు ఏమున్నాయో మూడు వారాల్లో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాను మంచికి ఉపయోగిస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని యువతరం చెడు మార్గాలకే ఎక్కువగా ఉపయోగిస్తుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com