ఇంపాల్: మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో సుర్చంద్రసింగ్, నామ్థాంగ్ హావోకిప్ సహా నలుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ బోణీ చేయగా, మరో ఎమ్మెల్యే జిన్సువుహౌ జౌ ఆయన బాటలో నడిచారు. కాగా మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ 28 స్థానాలు దక్కించుకోగా, 21 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ మాత్రం ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.