అమరావతి : ఏపి రాష్ట్ర కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను చంద్రబాబు వివరించారు. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారు.