అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం 98శాతం విజయవంతం అయ్యిందని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ తో కమ్యూనికేషన్ తెగిపోవడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు శోధిస్తున్నారని నివేదిక అనంతరం తదుపరి కార్యాచరణ చేపడుతామన్నారు. తదుపరి లక్ష్యం గగన్ యాన్ మిషన్ అని 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సాయుధ బలగాల్లో ఫ్లయింగ్ టెస్ట్ అనుభవమున్నవారిని వ్యోమగాములుగా పంపాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ముగ్గురిని ఎంపిక చేసిన తర్వాత భారత్, రష్యాలో శిక్షణ ఇప్పిస్తామని శివన్ తెలిపారు.