అమరావతి నిర్మాణంవద్దని రాయలసీమకి నీళ్లు తీసుకుపోవటం ద్వారా ఏపి అభివృద్ధి చెందుతుందని తాను అప్పుడే చంద్రబాబుకు చెప్పినట్లు సిఎం కేసీఆర్ తెలిపారు. ఎత్తిపోతలకు కరెంట్ బిల్లులపై ఆయన శాసనసభలో మాట్లాడుతూ... అమరావతి నిర్మాణం డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా ఆయన అభివర్ణించారు . అయినా చంద్రబాబు అమరావతి కట్టి వెల్లకిలా పడ్డాడని, పరిణామం ఏమిటో తెలిసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని . అమరావతి నిర్మాణం వృధా అనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఏపిలోని రాజకీయ పార్టీలు, ప్రజలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం పలు సంశయాలు లేవనెత్తి నిర్మాణాలను నిలపి వేసిన నేపథ్యం చూస్తుంటే దీని వెనుక కేసీఆర్ ఉన్నారన్న భావన కలుగుతోందంటూ ఆందోళనలు వ్యక్తం చేశారు పలువురు.