గురజాల నియోజకవర్గంలో సోమవారం ఏర్పాటు చేసిన బీజేపీ సభ కు వెళ్తున్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అనుమతి లేనందున సభను, మీ పర్యటనని రద్దు చేసుకోవాలని పోలీసులు విన్నవించినా కన్నా లక్ష్మీనారాయణకు గురజాలకు సోమవారం ఉదయమే బయలుదేరిన విషయం విదితమే నందిగం వద్ద భారీగా మోహరించిన పోలీసులు కన్నా లక్ష్మీనారాయణను, మరికొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోన్న విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. . దీంతో ఉద్రిక్త్త చోటు చేసుకొంది. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వేర్వేరు స్టేషన్లకి తరలిస్తున్నట్టు సమాచారం అందుతోంది.