టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడులోని ఆత్మకూరు బాధితులతో ఈరోజు ఫోన్ లో మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఏసోబు సహా వైసీపీ బాధితులు పలువురికి ఆయన ఫోన్ చేసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ‘ఊళ్లో ఎలా ఉన్నారు? మీ ఇంట్లోనే ఉన్నారా?’ అని ప్రశ్నించారు. ‘ఇళ్లల్లోకి వెళ్లారు. మరి పొలాల్లోకి వెళ్లారా? అని అడిగి తెలుసుకున్నారు. ‘ఇళ్లు బాగు చేసుకుంటున్నాం’ అని చంద్రబాబుకు బాధితులు బదులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బాధితులు ధన్యావాదాలు తెలిపారు.