తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రవాస భారతీయుడు ఎం.శ్రీనివాసరెడ్డి రూ.1,00,00,116 విరాళాన్ని సమర్పించారు. రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని నిత్య అన్న ప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని దాత సూచించారు.