జగన్ సర్కార్ వంద రోజుల పాలనపై ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. వంద రోజుల్లోనే అన్నీ చేసేయాలని ఆశించడం లేదు..కానీ జగన్ సర్కారు బాధ్యతాయుతంగా అందర్ని కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు.. ఐదేళ్ల పాలనకు వంద రోజుల పాలన సూచికగా నిలుస్తుంది ..అయితే జగన్ సర్కార్ సరైన దిశలో పయనించడం లేదని విమర్శించారు . దీర్ఘకాల అభివృద్ధికి అనుగుణంగా సర్కారు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు. జగన్ పాలన ఇలా ఉంటే సీఎం జగన్ వ్యవహారిస్తున్న తీరు మాత్రం సరిగ్గా లేదని ...భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా వ్యవహించాలని.... అందరిని కలుపుకుని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు సూచించారు.