కాళహస్తి పట్టణంలో కైలాసగిరిప్రాంతంలో వెలిసిన శ్రీఆంజనేయస్వామి ఆలయంలో వందేళ్ళ చరిత్ర మహిమకలిగిన రావిచెట్టుని స్థానిక ఆలయఅర్చకులు, కమిటీ సభ్యులు ఆ చెట్టు ఆలయంలో అడ్డంగా ఉందని మహిమ కలిగిన ఆ మహవృక్షాన్ని దైవభక్తిని సైతం పక్కన పెట్టి ఆ వృక్షాన్ని నరికివేయడం, భక్తులమనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని బీజేపీ నాయుకుడు అమరనాధ్ విమర్శించారు.
చెట్లను పెంచండి పర్యావరణాన్ని రక్షించమని అంటు ప్రభుత్వం ప్రచారం చేస్తూఉంటే ఇక్కడ ఆలయకమిటీసభ్యులు మాత్రం ఆలయంలో ఉన్న చెట్లను నరికివేయండి అనే ధోరణిలో ఇక్కడి అర్చకులు ఉన్నారని ,దైవభక్తిని ఆధ్యాత్మికతను ప్రభోదించవలసిన అర్చకులే ఇలా దైవత్వం ఉన్న వందేళ్ళ మహావృక్షాన్ని నిర్దాక్షిణ్యంగా నరికివేయడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు.