ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 11:55 AM

ముంబయి : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నీమ్గల్ గ్రామ సమీంపలో షాహాడ - దొండైచ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధూలే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com