బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా(82) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా ఆయనకు వైద్యులు చికిత్సనందించారు. 2018లో మిశ్రా భార్య వీణా(72) అనారోగ్య కారణంగా చనిపోయారు. కాంగ్రెస్లో మిశ్రా సుదీర్ఘ కాలం కీలక నేతగా కొనసాగారు. బీహార్ 14వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా మిశ్రా సేవలందించారు. కాంగ్రెస్ను వీడిన తర్వాత ఆయన జేడీయూలో చేరారు.