ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాచీన వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2017, 01:10 AM

విజయవాడ, సూర్య బ్యూరో :  అతి పురాతన, ప్రాచీన  వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం వుందని పర్యాటకం , సాంస్కృతిక శాఖల కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ చెప్పారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సిద్దార్ధ ఆర్ట్‌‌స కళాశాల సమీపంలో గల మొగలారాజపురం గుహలవద్ద హెరిటేజ్‌ వాక్‌ను నాగులాపల్లి శ్రీకాంత్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత మొగలారాజపురం గుహలను సందర్శించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్థానికంగా వున్న సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తుగా వున్న ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో మొగలరాజపురంలో గుహలను తొలి పల్లవులకంటే ముందుగానే వీటిని నిర్మించినట్లు చర్త్రి చెపుతుందన్నారు. మొగరాజపురం గుహల వద్ద నుంచి 4 కిలోమీటర్లు వరకు అంటే కాళేశ్వరరావు మార్కెట్‌ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు దీనిని స్ఫూర్తిగా తీసుకుని వారసత్వ సంపదను కాపాడుకోవాలని వుందన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ టూరిజం ఆథారిటీ సిఇవో శశాంక్‌ శుక్లా మాట్లాడుతూ రాష్ర్టంలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హెరిటెజ్‌వాక్‌లో టూరిజం ఇడి మల్లికార్జునరావు, నూజివీడు ఆర్‌డివో చక్రపాణి, విజయవాడ అర్బన్‌ ఎమ్‌ఆర్‌వో ఆర్‌.శివరావ్‌ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com