కర్నూలు: డోన్ మండలం ఓబులాపురంమిట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు హైవే మలుపు వద్ద ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. మైసూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని వారు తెలిపారు.