కశ్మీర్ పరిష్కారంపై మధ్యవర్తిత్వం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రధానిని నిలదీస్తున్నాయి. మంగళవారం ఇదే విషయంపై పార్లమెంట్లో భారీ దుమారం చెలరేగింది. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు ట్రంప్తో మీరేం చర్చించారో పార్లమెంటుకు వివరణ ఇవ్వాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అమెరికాలంటి అగ్రరాజ్యాన్ని దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకొమని కోరటమంటే ఈ దేశ సారభౌత్వాన్ని తిరిగి విదేశీ పాలకులకు అప్పగించడమేనని నిలదీసాయి. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభలలో ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాయి.
అమెరికా ముందు భారత్ దాసోహం అయ్యిందంటూ లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మండి పడ్డారు. మనం బలహీనులం కాదు, మన ససమ్యను ఎలా పరిష్కిరంచుకోవాలో మనకు తెలుసు. దీనిలో అమెరికా జోక్యం ఎందుకు కోరారో ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని మోదీ ఏనాడు, ఏసందర్భంలోనూ కశ్మీర్పై మధ్యవర్తిత్వం వహించాలని కోరలేదని రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సృష్టం చేశారు.