ముంబై : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ముంబై మేయర్ విశ్వనాథ్ మహాదీశ్వర్కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. మేయర్ మహాదీశ్వర్ శనివారం కోల్దొంగారి ఏరియాలోని విల్లే పార్లేకు వెళ్లారు. అంధేరి - విల్లే పార్లేను కలిపే రోడ్డులోని నో పార్కింగ్ జోన్లో తన వాహనాన్ని మేయర్ నిలిపారు. అక్కడ రోడ్డు ఇరుకుగా ఉండడంతో దాన్ని నో పార్కింగ్ జోన్గా ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ తన వాహనాన్ని పార్క్ చేయడంతో జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే జరిమానా ఎంత విధించారనేది తెలియాల్సి ఉంది.