పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయిలు మోసగించి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సికి ఆంటిగ్వా ప్రభుత్వం ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేసింది. మెహుల్ చోక్సి ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వం పొందాడు. దీనితో భారత్కు అప్పగించడానికి ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆంటిగ్వా ప్రభుత్వం చోక్సి పౌరసత్వాన్ని రద్దు చేయడంతో అతడిని భారత్కు అప్పగించడానికి లైన్ క్లియర్ అయింది.