ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాష్ట్రాల్లో ేకశినేని ట్రావెల్స్‌ మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2017, 12:56 AM

విజయవాడ, సూర్యబ్యూరో : కేశినేని ట్రావెల్స్‌ సర్వీసులన్నీ శుక్రవారం అర్థరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణా టక రాష్ట్రాల్లో ఆ ట్రావెల్స్‌ కార్యా లయాన్ని మూతపడ్డాయి. ఈ మేరకు కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ యజమాని కేశినేని శ్రీనివాస్‌ (నానీ) ప్రకటించారు. దీంతో 170 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. గత వారం రోజుల నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ను నిలిపేశారు. కేశినేని ట్రావెల్స్‌ మూసివేతకు ప్రధాన కారణం ఏపీ రవాణాశాఖ కమిషనర్‌ సుబ్రమణ్యంతో గొడవ నేపథ్యంలోనే సంస్థ మూసివేతకు నాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్టీఏ అధికారులపై దాడి నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నాని ఆయన చేత రవాణా శాఖ కమినర్‌కు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పించారు. ఈ విషయంలో కేశినేని తీవ్ర మనస్తా పానికి గురైనట్లు సమాచారం. ట్రావెల్స్‌ను మూసివేయొద్దని చంద్రబాబు కోరినా  తాను మాత్రం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ట్రావెల్స్‌ మూసివేస్తున్నట్లు స్వయంగా కేశినేని నాని ప్రకటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com