విజయవాడ, సూర్యబ్యూరో : ఎమ్మేల్యేలు, సాంఘిక సంక్షేమ శాఖ ఆధికారులు మీ సహాయ సహాకారాలు అందించాలని శనివారం నగరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు కోరారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతీ సందర్భంగా సీఎం చంద్రబాబు గత సంవత్సరం అసెంబ్లీలో చెప్పిన విధంగా సంవత్సరం అంతా ఆ మహానీయున్ని జయంతోత్సవాలు రాష్ట్రంలో జరపడం జరిగిందన్నారు. ఈ సమీక్షా సమా వేశంలో ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మేల్యేలు ఉపలేటి కల్పన, శ్రావణ్కుమార్, బోడే ప్రసాద్, చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మేల్యే అదిత్య , నందిగామ ఎమ్మేల్యే తంగిరాల సౌమ్య, తదితర ఎమ్మేల్యేలు, ఎస్.సి కార్పొరేషన్ ప్రిస్సిపల్ సెక్రటరీ రావత్, ఎస్.టి కార్పొరేషన్ ప్రిస్సిపల్ సెక్రటరీ సిసోడియా, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ కమీషనర్ పద్మ, ఎస్.సి కార్పొరేషన్ జె.డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.