హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు జగన్ వెంట వెళ్లనున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలను కలిసేందుకు మూడు రోజుల పాటు జగన్, పార్టీ నేతలు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకోవడంపై ఫిర్యాదు చేయనున్నారు. జగన్ కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని జాతీయ పార్టీల అపాయింట్మెంట్ను కోరారు.