ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం ప్ర‌భంజ‌నాన్ని అడ్డుకోలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2019, 05:37 PM

తెలుగుదేశం పార్టీ ఈ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని త‌మ పార్టీకి మరోసారి ప్రజలు పట్టం కట్టబోతున్న ట్లు,  టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు పేర్కొన్నారు.   గుంటూరులో ఆయన   మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ సర్వే సంస్థలు చేపట్టిన సర్వేలలో సింహ భాగం సర్వేలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, జాతీయ సర్వే లు మెజార్టీ శాంపిల్ సైజు స్వల్పంగా తీసుకోబట్టే 2014 ఎన్నికల సమయంలో ఇదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సర్వేలు ప్రకటించి బోల్తా పడిన విషయం గమనించాలన్నారు. 


 దేశంలో అనేక వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని, సమాజంలో 4 వ పాదం గా ఉండే మీడియాను సైతం భయబ్రాంతులకు గురి చేసి తన చెప్పుచేతల్లో పెట్టుకున్న మోడీ, దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను కూడ బెడుతున్న చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగా సర్వే లు ప్రకటించి మిత్రపక్షాల లో చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నార‌ని విమ‌ర్శించారు. 


సర్వేలు తమకు ముఖ్యం కాదని, ప్రజా నిర్ణయమే తమకు శిరోధార్యమని, ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా 23వ తేదీ నాడు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు రంగారావు పేర్కొన్నారు. 110 నుండి 130 వరకు అసెంబ్లీ స్థానాలు., 20 వరకు పార్లమెంట్ స్థానాలలో తాము విజయఢంకా మోగించబోతునట్లు రంగారావు పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com