లంచాలు తెగ మరిగిన మరో అవినీతి తిమింగలం ఏసిబి అధికారుకు చిక్కింది. చిత్తూరు జిల్లా కలికిరి మండలం మర్రి కుంటపల్లి విఆర్వో సుధాకర్ ఓ పేద రైతు నుండి రూ.4 వేలు లంచం తీసుకుంటూండగా తిరుపతి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘనటన వివరాలను అధికారులు మీడియాకు అందించారు. ఈవివరాల మేరకు మేడికుర్తికి చెందిన జబ్బార్ కుమారుడు
రైతు అర్షద్ అలీ పాస్ బుక్కు చేయాలని విఆర్ ఓ సుధాకర్ ను ఆశ్రయించాడు. ఇతని అవసరాన్ని గమనించిన విఆర్వో పది వేలు డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.5 వేలు అందించి ఇక ఇచ్చుకోలేనని పాస్ బుక్ ఇవ్వమని కోరినా మిగిలిన రూ. 5 వేలు కూడ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అర్షాద్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో తిరుపతి ఏసీబీ అధికారులు మంగళవారం కలికిరి తహసీల్దార్ కార్యాలయం పై దాడిచేయగా రైతు నుంచి తీసుకున్న రసాయనాలు కలిసిన రూ.4 వేల నోట్లను విఆర్ఓ సుధాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా కలికిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడి చేయడం రెండు సంవత్సరాల లో ఇది రెండవ సారి కావడం విశేషం.తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్ ఓ తిరుమలేశ్వర్ రెడ్డి,డివై ఎస్పి ఉన్నారు.ఇంకా విచారణ కొనసాగుతున్నది