తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలవాడి దర్శనానికి వైకుంఠంలోని అన్ని క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపలు కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం, నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న63,548 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,290 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.89 కోట్లుగా ఉంది