ఢిల్లీలో పట్టపగలు దారుణం జరిగింది. వికాసపురి ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ళ యువతి ఫ్లైఓవర్పై నుంచి బంతిలా ఎగిరి కింద పడింది. ఆమె కింద పడిన దృశ్యం దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. సదరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కునాల్, జియాతో కలిసి స్వప్న అనే యువతి ఫ్లైఓవర్పై బైక్లో ప్రయాణిస్తోంది. అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఓ వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న ఫ్లైఓవర్ పైనుంచి ఒక్కసారిగా ఎగిరి కింద పడింది. వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు.
అయితే అప్పటికే స్వప్న స్పృహ కొల్పోయింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు పెద్ద గాయాలేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారం. కేవలం మైనర్ ఫ్యాక్చర్ మాత్రమే అయిందని డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఫ్లైఓవర్ పైనే ఉండిపోయిన స్వప్న స్నేహితులు కునాల్, జియాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.