సిబ్బంది ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎచ్చెర్ల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కు జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఆర్మడ్ సిబ్బంది ఎస్పీకు గౌరవ వందన సమర్పించి పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.