వెలగపూడి సచివాలయంలో ఈనెల 30వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనున్నది. మంత్రి మండలి సమావేశంలో ప్రధానంగా కొత్తగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. డ్వాక్రా మహిళలకు రూ.10వేల సాయం, స్మార్ట్ ఫోన్ల పంపిణీ, రైతు రక్ష పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. రైతులు, మహిళలు, పేద వర్గాలకు లబ్ది కలిగేలా ప్రకటించిన వరాల కలిగే లభ్దిపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్ధేశం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.