జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతికి వెళ్లారు. అమరావతి రైతులకు మొదటి నుంచి జనసేనాని అండగా ఉన్నారు. ఆనాడు అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి పోలీసుల ఇనుప కంచెలను దాటుకుని, కాలినడకన పవన్ అమరావతికి వచ్చారు. రైతుల వార్షిక కౌలు, అసైన్డ్ రైతుల సమస్యల పరిష్కారానికి అప్పటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీసారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ తొలిసారిగా ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చారు.