ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో భారీ అక్రమాలు జరిగాయని జనసేన పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమాలపై విచారణ జరపాలని ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏసీఏలో అక్రమాలకు సంబంధించి 2008లో హైకోర్టులో కేసు నడుస్తోందని గుర్తుచేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్ర రెడ్డిని ఎలా అధ్యక్షుడు చేశారని పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. వైస్ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చారని.. గోపినాథ్ రెడ్డి కార్యదర్శి అయ్యారని వివరించారు. ముగ్గురికి క్రికెట్ చరిత్ర లేదని, అలాంటిది వీరికి ఎలా పదవులు ఇస్తారని ప్రశ్నించారు.