పురుగుల మందు తాగి కరీమ్బాషా (21) అనే యువకుడు మృతి చెందాడు. మదనపల్లె రూరల్ పోలీసుల వివరాల మరకు మదనపల్లె మండలం, కొత్తపల్లె గ్రామం కొత్తయిండ్లకు చెందిన కరీమ్బాషాను జులాయిగా తిరు గుతునన్నాడని కుటుంబసభ్యులు మందలించడంతో గురువారం రాత్రి పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో కుటుంబీకులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలిం చగా మెరుగై వైద్యంకోసం డాక్టర్లు తిరుపతికి రెపర్ చేశారు. తిరుపతికి బయలుదేరి వెళ్లి వారు అక్కడ వైద్యం చేయించ కుండానే మదనపల్లెకు తిరుగుప్రయాణంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు తాలుకా సీఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్యం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.