కలికిరిలో ఓ ఇంటికి రంగులు వేసే పనిలో నిమగ్నమైన మురళి (45) అనే పెయింటర్ విద్యుత షాక్ కార ణంగా మృతి చెందాడు. కడప జిల్లా, పీలేరు మండలం మేకలవానికాలువ గ్రామానికి చెందిన మురళి కలికిరి బీడీ కాలనీలోని ఒక ఇంటికి శుక్రవారం రంగులు వేస్తుండగా ఒక ఇనుప కమ్మీ దగ్గరలోని విద్యుత తీగలకు తగలడంతో షాక్కు గురయ్యాడు. దీంతో అతను భవనం పై నుంచి కిందకు పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మురళి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కలికిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.