ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. మరోసారి రైళ్లు రద్దయ్యాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:29 PM

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనులతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే రైళ్లు (07977/07978) రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి 31 వరకు.. జూన్ 3 నుంచి 7 వరకు.. జూన్ 10 నుంచి 14 వరకు.. జూన్ 17 నుంచి జూన్ 21 వరకు బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ రైళ్లు (17237/17238) రద్దయ్యాయి. గుంటూరు-రాయగడ (17243/17244) రైళ్లను ఈ నెల 27 నుంచి జూన్ 24 వరకు రద్దు చేశారు. కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే (17267/17268) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు.


 మచిలీపట్నం-విజయవాడ (07896), విజయవాడ-మచిలీపట్నం (07769), విజయవాడ-మచిలీపట్నం (07866), మచిలీపట్నం-విజయవాడ (07770), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-నర్సపూర్‌ (07861), నర్సపూర్‌-విజయవాడ (07863), విజయవాడ-భీమవరం జంక్షన్ (07283) రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైళ్లు విజయవాడ, రామవరప్పాడు మధ్య ఈనెల 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు రద్దయ్యాయి.


మరికొన్ని రైళ్లను వయా విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. ఈ నెల 27, జూన్ 3, 10, 17న ఎర్నాకులం-పాట్నా (22643) రైలును దారి మళ్లించారు. భావనగర్-కాకినాడ పోర్ట్ (12756) రైలును జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-గౌహతి (12509) ఈనెల 29, 31, జూన్‌ 5, 7, 12, 14, 19, 21 తేదీల్లో దారి మళ్లించారు. ధన్‌బాద్‌-అల్లపూజ (13351) రైలు ఈనెల 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు దారి మళ్లించారు. చత్రపతి శివాజీ టెర్మినస్-భువనేశ్వర్‌ (11019) రైలు ఈ నెల 27, 29, 31, జూన్‌ 1, 3, 5, 7, 8, 10, 12, 14, 15 తేదీల్లో మళ్లించినట్లు తెలిపారు.


టాటానగర్‌-యశ్వంత్‌పూర్‌ (18111) ఈనెల 30, జూన్‌ 6, 13, 20 తేదీల్లో.. హతియా-ఎర్నాకులం (22837) ఈనెల 27, జూన్‌ 3, 10, 17 తేదీల్లో మళ్లించారు. హతియా-బెంగళూరు (18637) జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో దారి మళ్లించారు అధికారులు. హతియా-బెంగళూరు (12835) ఈనెల 28, జూన్‌ 2, 4, 9, 11, 16, 18, 23 తేదీల్లో.. టాటానగర్‌-బెంగళూరు (12889) ఈనెల 31, జూన్‌ 7, 14, 21 తేదీల్లో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.


ఈ నెల 27 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు అధికారులు. మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219) ఈనెల 27 నుంచి జూన్‌ 22వ తేదీ వరకు రద్దయ్యింది. తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22708) రైలు రద్దు చేశారు. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239) ట్రెయిన్‌ది అదే పరిస్థితి. విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22707), విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220) రైళ్లు ఈనెల 28 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖ-గుంటూరు డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701), గుంటూరు-విశాఖ డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22702), రాజమండ్రి-విశాఖ మెము (07466), విశాఖ-రాజమండ్రి మెము (07467) రైళ్లను ఈనెల 27 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు రద్దు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com